రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నటుడు, సినీ విమర్శకుడు చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే. కాగా కత్తి మహేష్ మృతిపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కారులో ముందు కూర్చున్న కత్తి మహేష్ చనిపోగా.. పక్కనే ఉన్న వ్యక్తికి చిన్న గాయం లేకుండా ఎలా బతికాడని మందకృష్ణ ప్రశ్నించారు. కత్తి మహేష్కు అనేక మంది శత్రువులు ఉన్నారని అన్నారు. కారు కూడా కత్తి మహేష్ కూర్చున్న వైపుకే డ్యామేజ్ అవడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
కత్తి మహేష్ కు మొదట అసలు గాయలే కాలేదన్నారు. కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయన గురించి దారుణంగా కామెంట్స్ చేశారని మందకృష్ణ చెప్పారు. కత్తి మహేష్ అంత్యక్రియలకి హాజరైన అనంతరం మందకృష్ణ చిత్తూరు జిల్లా యల్లమందలో పై విధంగా మాట్లాడారు.
కత్తి మహేష్ మృతిపై నిజాయితీ ఉన్న ఉన్నతాధికారులు, లేదంటే సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలని, 15 రోజులు జరిగిన ట్రీట్మెంట్ ఏంటన్నది ఆస్పత్రుల నుంచి బయటకు రావాలని, ప్రమాదం జరిగిందా, లేదా, మృతి వెనుక మిస్టరీ ఉందా, లేదా అన్న విషయం తేలాలని మందకృష్ణ మాదిగ అన్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…