కరోనా నేపథ్యంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్తగా కవచ్ పర్సనల్ లోన్ కింద వ్యక్తిగత రుణాలను అందజేసే స్కీమ్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద రూ.25వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. వినియోగదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు కోవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చును ఈ రుణంతో భర్తీ చేయవచ్చు.
ఈ స్కీమ్ కింద తీసుకునే రుణానికి 8.5 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ముందస్తుగా రుణాన్ని చెల్లిస్తే ఎలాంటి చార్జిలను వసూలు చేయరు. పెనాల్టీ కూడా ఉండదు. ఈ స్కీమ్ కింద తీసుకునే రుణాలను గరిష్టంగా 5 ఏళ్ల కాల పరిమితితో చెల్లించవచ్చు. అలాగే 3 నెలల మారటోరియం సదుపాయం లభిస్తుంది.
ఉద్యోగం చేసే వారు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి పొందే వారు కూడా ఈ రుణానికి దరఖాస్తు చేయవచ్చు. ఏప్రిల్ 1, 2021 తరువాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణం పొందేందుకు అవసరమైన పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులు యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇతర కస్టమర్లు తమకు సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచిలో సంప్రదించాల్సి ఉంటుంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…