Railway Rule : చాలామంది, ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణం చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. రైలు లో ట్రావెల్ చేసినప్పుడు రూల్స్ ని కనుక పాటించకపోతే, కచ్చితంగా జరిమానా పడడం, జైలు శిక్ష వంటివి ఉంటుంటాయి. దీపావళి పండుగని దృష్టి లో పెట్టుకుని, భారతీయ రైల్వేస్ రైలు ప్రయాణికుల కోసం కొత్త రూల్స్ ని అమలు చేసింది. ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల భద్రతా సౌకర్యాన్ని దృష్టి లో పెట్టుకొని ఈ రూల్స్ ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే రైల్లో పటాకులు వంటివి తీసుకు వెళ్లకూడదు, మండుతున్న వస్తువుల్ని తీసుకెళ్లడని నిషేధించింది.
దీపావళి పండగ దగ్గర పడింది. దీపావళి కి చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళుతూ ఉంటారు. సిటీస్ లో ఉండే వాళ్ళు ఇళ్ళకి రావడం, ప్రియమైన వారి కోసం ట్రావెల్ చేసి వెళ్లడం, వంటివి చేస్తూ ఉంటారు. దీనితో రద్దీ కూడా పెరుగుతుంది.
రైల్వే శాఖ అందుకని ప్రవేశపెట్టిన నిబంధన విషయానికి వస్తే.. పటాకులు లేదంటే అలాంటి వస్తువులని ట్రైన్ లో తీసుకెళ్లడం తప్పు అని, ప్రయాణికుల భద్రత ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ ని ఇండియన్ రైల్వేస్ తెచ్చింది. ఒక వేళ కనుక ప్రయాణికులు తప్పు చేసినట్లయితే , రైల్వే చట్టం లోని సెక్షన్ 164 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ నియమాన్ని పాటించక పోతే , ఆ వ్యక్తి కి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే వెయ్యి జరిమానా. లేకపోతె రెండు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కచ్చితంగా ప్రయాణికులు ఈ నిబంధనని పాటించాలి. ప్రయాణం లో బాణసంచా తీసుకెళ్లద్దని ఇండియన్ రైల్వేస్ కోరుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…