Radha Daughter Karthika : అలనాటి అందాల తార రాధ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె చిరంజీవికి జంటగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించింది. ఇక రాధ పెద్ద కుమార్తె కార్తీక కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’తో కార్తీక హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆ వెంటనే ‘రంగం’ సినిమాతో హిట్ అందుకుంది కార్తీక. ఇక ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో కార్తీక నటించారు. కానీ, హీరోయిన్గా టాలీవుడ్లో నిలదొక్కుకోలేకపోయిన ఈ అమ్మడు చివరిగా 2015లో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరపై కనిపించి ఆ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పింది.
రాధ వారసులుగా కార్తీక నాయర్, తులసి నాయర్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాధ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేయగా కూతుళ్లు మాత్రం ఆమె పేరుని నిలబెట్టలేకపోయారు. కార్తీక సినిమాలకి బ్రేక్ ఇచ్చాక దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ చూసుకుంటున్నారు.క్కడ తమ బిజినెస్ ని మరింత విస్తరించిన కార్తీక.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. గత అక్టోబర్ నెలలో కార్తీక ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్లి కూడా మరి కొద్ది రోజులలోనే జరబోతున్నట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. రాధనే స్వయంగా పలువురు సెలెబ్రిటీల ఇంటికి వెళ్లి ఆహ్వానాలు పంచుతున్నారు.
రీసెంట్గా ప్రముఖ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావును రాధ కలిశారు. ఆయన్ని పెళ్లికి ఆహ్వానించారు. తనకు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి రాధ తొలి ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుండగా, త్వరలో చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి ఆహ్వానం అందిచంనుందని సమాచారం. అయితే రాధకి కాబోయే అల్లుడు ఎవరు, ఏం చేస్తాడు అనే వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉన్నాయి.రాధ 1980 కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించగా, తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…