PM Mudra Loan : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలను పలు అంశాల్లో వెల్లడించారు. ముఖ్యంగా ముద్ర రుణాల పరిమితిపై ఆమె పలు ముఖ్యమైన విషయాలను ప్రకటించారు. ముద్ర పథకం కింద ఔత్సాహికులకు ఇస్తున్న రుణ పరిమితిని పెంచినట్లు ఆమె తెలియజేశారు. దీని వల్ల ఎలాంటి హామీ లేకుండానే లబ్ధిదారులు భారీ ఎత్తున రుణం పొందవచ్చు. ఇప్పటి వరకు ముద్రలో పలు విభాగాల్లో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేవారు. అయితే ఈ పరిమితిని తాజాగా పెంచారు.
కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8వ తేదీన ముద్ర పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఔత్సాహికులకు చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఎలాంటి హామీ లేకుండానే తక్కువ వడ్డీకే రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ రుణ పరిమితిని కేంద్రం తాజాగా రూ.20 లక్షలకు పెంచింది. దీంతో లబ్ధిదారులు గరిష్టంగా ఇప్పుడు ఎలాంటి హామీ లేకుండా ఏకంగా రూ.20 లక్షల మేర రుణం తీసుకోవచ్చు.
ఇక ఇప్పటికే ముద్ర రుణాలను తీసుకుని సకాలంలో రుణాలను చెల్లించిన వారు రూ.20 లక్షల మొత్తాన్ని తీసుకునేందుకు అర్హులని ప్రకటించారు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ పథకం కింద రుణాన్ని పొందవచ్చు. దీని కింద చిన్న తయారీ యూనిట్లు, దుకాణదారులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, సర్వీస్ సెంటర్లు, ఆర్టిస్టులు వంటి వారు రుణాలను పొందవచ్చు.
ఇక ఈ పథకంలో మొత్తం 3 విభాగాలు ఉన్నాయి. చైల్డ్ లోన్ కింద రూ.50వేల వరకు రుణం ఇస్తారు. అయితే కిశోర్ రుణం కింద అయితే గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అదే తరుణ్ విభాగం కింద అయితే ప్రస్తుతం పెంచిన పరిమితి ప్రకారం ఏకంగా రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీంతో వ్యాపారం లేదా పరిశ్రమ స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…