ప్రజల నిత్యావసర వస్తువులలో ఒకటిగా ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ కొనాలన్నా సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఈ విధంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ ఏడాదిలో 12 సిలిండర్లను ఉపయోగించే కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీని ఖాతాలో జమ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసి అందుకున్నాక కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి.
ప్రస్తుతం సిలిండర్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సబ్సిడీ డబ్బును కస్టమర్ల ఖాతాలలో వేయటం వల్ల కొంతమేరకు ఉపశమనం కలిగినప్పటికీ కొందరికి ఈ సబ్సిడీ డబ్బులు జమ కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విధంగా సబ్సిడీ డబ్బులు వారి ఖాతాలలో జమ కాకపోవడానికి పలు కారణాలు ఉంటాయి.
తప్పనిసరిగా కస్టమర్లు వారి ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి. ఇలా చేయని నేపథ్యంలో వారికి సబ్సిడీ డబ్బులు జమ కావు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే జమవుతాయి. అంటే వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైగా వచ్చేవారికి సబ్సిడీ డబ్బులు అందవు. అయితే సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే వెంటనే కస్టమర్లు https://www.mylpg.in/ అనే వెబ్సైట్లో చెక్ చేయాలి. మీకు సబ్సిడీ డబ్బులు పడకపోతే వెంటనే డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి గ్యాస్ బుక్ వివరాలను ఇచ్చి సబ్సిడీ పడటం లేదని కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…