ప్రజల నిత్యావసర వస్తువులలో ఒకటిగా ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ కొనాలన్నా సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఈ విధంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ ఏడాదిలో 12 సిలిండర్లను ఉపయోగించే కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీని ఖాతాలో జమ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసి అందుకున్నాక కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి.
ప్రస్తుతం సిలిండర్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సబ్సిడీ డబ్బును కస్టమర్ల ఖాతాలలో వేయటం వల్ల కొంతమేరకు ఉపశమనం కలిగినప్పటికీ కొందరికి ఈ సబ్సిడీ డబ్బులు జమ కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విధంగా సబ్సిడీ డబ్బులు వారి ఖాతాలలో జమ కాకపోవడానికి పలు కారణాలు ఉంటాయి.
తప్పనిసరిగా కస్టమర్లు వారి ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి. ఇలా చేయని నేపథ్యంలో వారికి సబ్సిడీ డబ్బులు జమ కావు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే జమవుతాయి. అంటే వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైగా వచ్చేవారికి సబ్సిడీ డబ్బులు అందవు. అయితే సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే వెంటనే కస్టమర్లు https://www.mylpg.in/ అనే వెబ్సైట్లో చెక్ చేయాలి. మీకు సబ్సిడీ డబ్బులు పడకపోతే వెంటనే డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి గ్యాస్ బుక్ వివరాలను ఇచ్చి సబ్సిడీ పడటం లేదని కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…