మహిళలపై దేశంలో రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు శాడిస్టు భర్తలు చిన్న విషయాలకే తమ భార్యలపై దాడి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ భార్యలను హతమారుస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న గౌతమ్ నగర్కు చెందిన సమీర్, షబ్నమ్ ఖాన్ (35)లు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబ్నమ్ ఇంటికి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే విషయమై భర్తను అడిగింది. కానీ అందుకు సమీర్ ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే భార్యా భర్త మధ్య గొడవ పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సమీర్ రాత్రి 11 గంటల సమయంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అతను ఇంటి నుంచి పారిపోయాడు.
తరువాత ఆమె పెద్దగా కేకలు వేయడంతో నిద్ర లేచిన ఆమె పెద్ద కుమారుడు ఇరుగు పొరుగు వారికి, తన అమ్మమ్మ, తాతలకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకుని తమ కుమార్తెను హాస్పిటల్కు తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం 35 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు సమీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…