ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) బంపర్ ఆఫర్ను అందిస్తోంది. ఐఆర్సీటీసీ, కోరోవర్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓ కాంపిటీషన్లో పాల్గొంటే రూ.1 లక్ష గెలుచుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వీడియోలను తీసి అప్లోడ్ చేయడమే.
ప్రయాణాలు అంటే బాగా ఇష్టం ఉన్నవారు భారతీయ రైల్వేతోపాటు ఐఆర్సీటీసీకి చెందిన టిక్కెటింగ్, కాటరింగ్, టూరిజం వంటి పలు రకాల అంశాలపై వీడియోలను తీయాలి. వాటిని https://corover.ai/vlog/ అనే సైట్లో అప్లోడ్ చేసి వివరాలను నమోదు చేసి కాంపిటీషన్ లో పాల్గొనాలి. దీంతో ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందజేస్తారు.
రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25వేల బహుమతిని అందజేస్తారు. అలాగే ట్రోఫీ, సర్టిఫికెట్ను కూడా ప్రదానం చేస్తారు. ఇక మరో 297 మందికి రూ.500 నగదు బహుమతి, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 31లోగా తమ వీడియోలను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోవాలి. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ఈ పోటీలో మొత్తం 300 విన్నర్లకు నగదు బహుమతులను అందజేస్తారు. వీడియోల క్వాలిటీని బట్టి విన్నర్లను ఎంపిక చేస్తారు. యూజర్లు పంపిన అన్ని వీడియోలు ఐఆర్సీటీసీకి చెందుతాయి. కాపీరైట్ వారికే ఉంటుంది. కానీ వీడియో తీసిన వారి పేరును దానిపై వేస్తారు. యూజర్లు ఐఆర్సీటీసీకి చెందిన IRCTC Tourism, IRCTC Air, IRCTC iMudra App, Website, IRCTC E-Catering, IRCTC SBI Card, IRCTC New E-Ticketing Website, IRCTC Bus Booking, IRCTC Tejas Train, IRCTC Retiring Room Booking వంటి అంశాలపై వీడియోలను తీయవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ తాజాగా ఓ ట్వీట్లో తెలియజేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…