Torn Currency Notes : అందరూ అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోలేరు. కొన్ని రకాల వస్తువులు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే కరెన్సీ నోట్లు కూడా కొన్ని కారణాల వల్ల చిరిగిపోతుంటాయి. ఇక కొన్ని నోట్లు అయితే మురికి లేదా మరకలు అంటుకుంటాయి. కొన్ని నోట్లపై రాతలు రాస్తారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల నోట్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే మీ వద్ద కూడా ఇలాంటి నోట్లు ఉంటే మీరు దిగులు పడాల్సిన పనిలేదు. వాటిని మీరు ఎంచక్కా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వద్ద చిరిగిన లేదా పాడైపోయిన, మరకలు అంటిన కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మీరు మీకు సమీపంలోని ఆర్బీఐ శాఖ కార్యాలయం లేదా మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే కరెన్సీ నోట్లను ఇలా మార్పిడి చేసేందుకు బ్యాంకులు కొంత రుసుము వసూలు చేస్తాయి. సాధారణంగా అలాంటి కరెన్సీ నోట్ల విలువ రూ.5వేల వరకు ఉండి నోట్లు 20 వరకు ఉంటే వాటిని ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగానే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. అలాగే 20 నోట్ల కన్నా ఎక్కువ ఉండి వాటి విలువ రూ.5వేలకు మించితే మాత్రం బ్యాంకులు కొంత రుసుము వసూలు చేసి ఆ నోట్లను మార్పిడి చేస్తాయి.
ఇక అలాంటి నోట్ల విలువ రూ.50వేలకు మించితే మాత్రం బ్యాంకులు కాస్త జాగ్రత్త తీసుకుంటాయి. మీ వివరాలను పూర్తిగా నమోదు చేసి కొంత ఎక్కువ రుసుముతో ఆ నోట్లను మార్పిడి చేస్తాయి. అయితే మీరు అలాంటి నోట్లను బ్యాంకుల్లో రోజుకు 20 నోట్ల వరకు మాత్రమే మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ.5వేలు లేదా అంతకు లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మరుసటి రోజు మార్పిడి చేసుకోవాలి. ఇలా మీ వద్ద ఉన్న చిరిగిన నోట్లను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మీ వద్ద ఉన్న అలాంటి కరెన్సీ నోట్లను బ్యాంకులు గనక తీసుకోకపోతే అప్పుడు మీరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ వెబ్సైట్ను సందర్శించి మీరు అందులో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదా ఆర్బీఐకి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతో బ్యాంకుపై ఆర్బీఐ వారు తగిన చర్యలు తీసుకుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…