Torn Currency Notes : అందరూ అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోలేరు. కొన్ని రకాల వస్తువులు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే కరెన్సీ నోట్లు కూడా కొన్ని కారణాల వల్ల చిరిగిపోతుంటాయి. ఇక కొన్ని నోట్లు అయితే మురికి లేదా మరకలు అంటుకుంటాయి. కొన్ని నోట్లపై రాతలు రాస్తారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల నోట్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే మీ వద్ద కూడా ఇలాంటి నోట్లు ఉంటే మీరు దిగులు పడాల్సిన పనిలేదు. వాటిని మీరు ఎంచక్కా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వద్ద చిరిగిన లేదా పాడైపోయిన, మరకలు అంటిన కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మీరు మీకు సమీపంలోని ఆర్బీఐ శాఖ కార్యాలయం లేదా మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే కరెన్సీ నోట్లను ఇలా మార్పిడి చేసేందుకు బ్యాంకులు కొంత రుసుము వసూలు చేస్తాయి. సాధారణంగా అలాంటి కరెన్సీ నోట్ల విలువ రూ.5వేల వరకు ఉండి నోట్లు 20 వరకు ఉంటే వాటిని ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగానే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. అలాగే 20 నోట్ల కన్నా ఎక్కువ ఉండి వాటి విలువ రూ.5వేలకు మించితే మాత్రం బ్యాంకులు కొంత రుసుము వసూలు చేసి ఆ నోట్లను మార్పిడి చేస్తాయి.
ఇక అలాంటి నోట్ల విలువ రూ.50వేలకు మించితే మాత్రం బ్యాంకులు కాస్త జాగ్రత్త తీసుకుంటాయి. మీ వివరాలను పూర్తిగా నమోదు చేసి కొంత ఎక్కువ రుసుముతో ఆ నోట్లను మార్పిడి చేస్తాయి. అయితే మీరు అలాంటి నోట్లను బ్యాంకుల్లో రోజుకు 20 నోట్ల వరకు మాత్రమే మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ.5వేలు లేదా అంతకు లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మరుసటి రోజు మార్పిడి చేసుకోవాలి. ఇలా మీ వద్ద ఉన్న చిరిగిన నోట్లను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మీ వద్ద ఉన్న అలాంటి కరెన్సీ నోట్లను బ్యాంకులు గనక తీసుకోకపోతే అప్పుడు మీరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ వెబ్సైట్ను సందర్శించి మీరు అందులో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదా ఆర్బీఐకి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతో బ్యాంకుపై ఆర్బీఐ వారు తగిన చర్యలు తీసుకుంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…