సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని బ్యాంకింగ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. అచ్చం బ్యాంకు నంబర్లలాగే ఉండే ఫోన్ నంబర్లతో కొందరు దుండగులు కాల్స్ చేస్తున్నారు. బ్యాంకు వివరాలను చెప్పమని అడుగుతున్నారు. దీంతో నిజంగానే బ్యాంకు నుంచి కాల్ చేశారు కావచ్చని చెప్పి చాలా మంది వివరాలను చెబుతున్నారు. డబ్బులు నష్టపోతున్నారు. అందుకనే అలాంటి కాల్స్, నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా బ్యాంకులకు చెందిన టోల్ ఫ్రీ నంబర్లు 1800 223 464 తరహాలో ఉంటాయి. అంటే ముందుగా 1800 ఉంటుంది. అయితే మోసగాళ్లు 1800 లో 1 లేకుండా 800 తో మొదలు పెట్టి నంబర్లు ఉండే ఫోన్ నంబర్లతో కాల్స్ చేస్తున్నారు. అంటే.. ముందు ఇచ్చిన 1800 223 464 నంబర్లో 1 లేకపోతే 800 223 464 అవుతుందన్నమాట. ఇలాంటి నంబర్లతో కాల్స్ చేస్తున్నారు.
ఇక కస్టమర్లకు కూడా అవి బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్లలాగే అనిపిస్తున్నాయి. దీంతో వారు నిజంగానే బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తున్నారేమోనని చెప్పి అవతలి వ్యక్తి అడిగిన ప్రతి సమాచారం చెబుతున్నారు. ముఖ్యమైన బ్యాంకింగ్ వివరాలను చెబుతున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నంబర్లు, పాస్వర్డ్లు, పిన్లను చెబుతున్నారు. దీంతో మోసగాళ్లు ఆ వివరాలతో క్షణాల్లోనే డబ్బులు మాయం చేస్తున్నారు. తరువాత వినియోగదారులు డబ్బులు పోయి లబోదిబోమంటున్నారు.
కనుక ఎవరికైనా సరే పైన తెలిపిన విధంగా ఉండే నంబర్లతో కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎస్బీఐ కూడా ఇదే విషయంపై తన కస్టమర్లకు మెసేజ్లను పంపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…