Ayushman Bharat Card : కేంద్ర ప్రభుత్వం, చాలా స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల ద్వారా, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. రైతుల కోసం ప్రత్యేకించి, కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలానే, పేదల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వాటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈరోజు చూద్దాం. ఆయుష్మాన్ స్కీమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలని పొందొచ్చు.
దీని కింద ఎంపిక చేసిన ఆసుపత్రిలో ఫ్రీగా చికిత్స పొందవచ్చు. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు, ఈ స్కీం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. పేదలకి ఆయుష్మాన్ భారత్ ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఐదు లక్షల వరకు చికిత్సని పొందడానికి అర్హులు. ఈ కార్డు కింద ఏ వ్యాధులకి చికిత్స పొందవచ్చు..? ఎటువంటి చికిత్సలు చేయించుకోవచ్చు అనేది కూడా చూద్దాం.
కరోనా, క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా, డయాలసిస్, మోకాలి, తుంటి మార్పిడి, కంటిశుక్లం అలానే ఇతర సమస్యల కి చికిత్స చేయించుకోవచ్చు. ఈ స్కీము ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. కచ్చా ఇళ్లలో ఉంటున్న ప్రజలు, భూమిలేని వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారు ఈ స్కీము కి అర్హులు. అలానే, గ్రామీణ ప్రాంతాల్లో వారు, ట్రాన్స్జెండర్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా అర్హులే.
ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే.. అధికారిక వెబ్సైట్ mera.pmjay.gov.in కి లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసేసి… మీ నంబర్కు వచ్చిన OTP ఇవ్వాలి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి వివరాలను ఇచ్చేయండి. కుడి వైపున ఉన్న కుటుంబ సభ్యులపై ట్యాబ్ చేసి, లబ్ధిదారులందరి పేర్లను కూడా యాడ్ చేయాలి. ఆ తరవాత మీకు కార్డు వస్తుంది.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…