Tripti Dimri : ఇప్పుడు ఎక్కడ చూసిన యానిమల్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా రణ్బీర్, రష్మికతో పాటు మరో భామ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు త్రిప్తి దిమ్రి. యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఆమె, తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో త్రిప్తి నటన, ఇంటిమేట్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ మూవీతో హిందీలోనే కాక తెలుగులోను ఈ బామకి ఫుల్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది.
తనకి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి స్పందిస్తూ.. ”నేను ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాను ఒప్పుకోలేదు. కానీ సౌత్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ”నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఆయనతో కలిసి నటించాలని నా కోరిక అంటూ ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. త్రిప్తి దిమ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ‘యానిమల్’లో రణ్బీర్కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు.
యానిమల్ చిత్రంలో ‘త్రిప్తి డిమ్రీ’ ‘జోయా’ అనే పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్లోను త్రిప్తి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక ‘యానిమల్’ సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ఈ అమ్మడు కోసం ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారనే టాక్ బాగా వినిపిస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…