మొబైల్స్ తయారీదారు వివో.. వై53ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. వై సిరీస్లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ లభిస్తున్నాయి. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్లో 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. దీంతో ఫోన్ను కేవలం 0.24 సెకన్ల వ్యవధిలోనే అన్లాక్ చేయవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
వివో వై53ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,490 ఉండగా.. దీన్ని అన్ని ఆన్ లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…