మొబైల్స్ తయారీదారు రియల్మి.. ఎక్స్7 మ్యాక్స్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. దీంతో డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ముందు వైపు 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 5జికి సపోర్ట్ లభిస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఈ ఫోన్ కేవలం 16 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది.
రియల్ మి ఎక్స్7 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ఆస్టరాయిడ్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, మిల్కీ వే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్తోపాటు రియల్మి ఆన్లైన్ స్టోర్లో, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…