స‌మాచారం

సైబ‌ర్ మోసం ద్వారా డ‌బ్బు కోల్పోయారా ? 10 రోజుల్లో రీఫండ్ వ‌స్తుంది..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పెద్ద నోట్లను ర‌ద్దు చేయ‌డం ఏమోగానీ అప్ప‌టి నుంచి దేశంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. బ‌య‌ట మ‌నం చిన్న వ‌స్తువు కొన్నా వ్యాపారుల వ‌ద్ద డిజిట‌ల్ చెల్లింపులు చేసేందుకు మాధ్య‌మాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స‌హ‌జంగానే ప్ర‌జ‌లు డిజిట‌ల్ చెల్లింపులు చేసేందుకు అల‌వాటు ప‌డ్డారు. అయితే డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతుండ‌డం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌రోవైపు సైబ‌ర్ మోసాలు కూడా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

దేశంలో రోజూ అనేక సైబ‌ర్ మోసాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌ల‌ను మాయ చేసి కొంద‌రు డ‌బ్బుల‌ను దోచేస్తున్నారు. అయితే సైబ‌ర్ మోసం బారిన ప‌డి డ‌బ్బును న‌ష్ట‌పోతే దిగులు చెందాల్సిన ప‌నిలేదు. వెంట‌నే బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయి. ఆర్‌బీఐ ఇందుకు ప్ర‌త్యేక నియ‌మావ‌ళిని సూచించింది.

సైబ‌ర్ మోసం జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు త‌మ అకౌంట్లు ఉన్న బ్యాంకుల‌కు సంఘ‌ట‌న జ‌రిగిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. దీంతో 10 రోజుల్లోగా పోయిన డ‌బ్బు తిరిగి వ‌స్తుంది. ఇక సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత 4-7 రోజుల మ‌ధ్యలో ఫిర్యాదు చేస్తే ప్ర‌జ‌లు రూ.25వేల వ‌ర‌కు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. మోస‌పోయిన మొత్తాన్ని బ‌ట్టి న‌ష్ట‌పోయే మొత్తం మారుతుంది. అయితే ప్ర‌జలు త‌మ ప్రమేయం లేకుండా డ‌బ్బు పోతే దాన్ని నిర్ణీత స‌మ‌యంలోగా ఫిర్యాదు చేసి వెన‌క్కి పొంద‌వ‌చ్చు. కానీ వారి నిర్లక్ష్యం కార‌ణంగా డ‌బ్బు పోతే బ్యాంకులు అందుకు బాధ్య‌త వ‌హించ‌వు.

ఇత‌రుల‌కు మీ బ్యాంక్ లేదా కార్డుల స‌మాచారం చెప్పినా, పిన్ లేదా పాస్‌వ‌ర్డ్‌ల‌ను షేర్ చేసినా, ఇత‌రుల‌తో కార్డు ఉప‌యోగించినా, క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేసి డ‌బ్బును న‌ష్ట‌పోయినా.. అందుకు ఖాతాదారుల‌దే బాధ్య‌త ఉంటుంది. క‌నుక ఇలాంటి సంద‌ర్భాల్లో బ్యాంకులు ఏమీ చేయ‌లేవు. ఖాతాదారుల ప్ర‌మేయం అస‌లు లేకున్నా డబ్బు పోతేనే బ్యాంకులు బాధ్యత వ‌హిస్తాయి. అలాంటి సంద‌ర్భాల్లోనే డ‌బ్బును బ్యాంకులు రీఫండ్ చేస్తాయి. మిగిలిన సంద‌ర్బాల్లో డ‌బ్బులు పోతే పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి ఉంటుంది. వారు మోస‌గాళ్ల‌ను ట్రేస్ చేసి గుర్తించి డ‌బ్బును రిక‌వ‌రీ చేస్తారు. అదీ మోస‌గాళ్ల దొరికితేనే, వారి ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంటేనే రిక‌వ‌రీకి సాధ్య‌మ‌వుతుంది. లేదా పోయిన డ‌బ్బులు వెన‌క్కి రావు. కనుక అత్యంత విలువైన మీ బ్యాంకింగ్ స‌మాచారాన్ని ఇత‌రుల‌కు అస్స‌లు చెప్ప‌కండి. బ్యాంకింగ్ మోసాల నుంచి జాగ్ర‌త్త‌గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM