ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం ఏమోగానీ అప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. బయట మనం చిన్న వస్తువు కొన్నా వ్యాపారుల వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు మాధ్యమాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో సహజంగానే ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అలవాటు పడ్డారు. అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతుండడం బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో రోజూ అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను మాయ చేసి కొందరు డబ్బులను దోచేస్తున్నారు. అయితే సైబర్ మోసం బారిన పడి డబ్బును నష్టపోతే దిగులు చెందాల్సిన పనిలేదు. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయి. ఆర్బీఐ ఇందుకు ప్రత్యేక నియమావళిని సూచించింది.
సైబర్ మోసం జరిగినప్పుడు ప్రజలు తమ అకౌంట్లు ఉన్న బ్యాంకులకు సంఘటన జరిగిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. దీంతో 10 రోజుల్లోగా పోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇక సంఘటన జరిగిన తరువాత 4-7 రోజుల మధ్యలో ఫిర్యాదు చేస్తే ప్రజలు రూ.25వేల వరకు నష్టపోవాల్సి ఉంటుంది. మోసపోయిన మొత్తాన్ని బట్టి నష్టపోయే మొత్తం మారుతుంది. అయితే ప్రజలు తమ ప్రమేయం లేకుండా డబ్బు పోతే దాన్ని నిర్ణీత సమయంలోగా ఫిర్యాదు చేసి వెనక్కి పొందవచ్చు. కానీ వారి నిర్లక్ష్యం కారణంగా డబ్బు పోతే బ్యాంకులు అందుకు బాధ్యత వహించవు.
ఇతరులకు మీ బ్యాంక్ లేదా కార్డుల సమాచారం చెప్పినా, పిన్ లేదా పాస్వర్డ్లను షేర్ చేసినా, ఇతరులతో కార్డు ఉపయోగించినా, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బును నష్టపోయినా.. అందుకు ఖాతాదారులదే బాధ్యత ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు ఏమీ చేయలేవు. ఖాతాదారుల ప్రమేయం అసలు లేకున్నా డబ్బు పోతేనే బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అలాంటి సందర్భాల్లోనే డబ్బును బ్యాంకులు రీఫండ్ చేస్తాయి. మిగిలిన సందర్బాల్లో డబ్బులు పోతే పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది. వారు మోసగాళ్లను ట్రేస్ చేసి గుర్తించి డబ్బును రికవరీ చేస్తారు. అదీ మోసగాళ్ల దొరికితేనే, వారి దగ్గర డబ్బు ఉంటేనే రికవరీకి సాధ్యమవుతుంది. లేదా పోయిన డబ్బులు వెనక్కి రావు. కనుక అత్యంత విలువైన మీ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులకు అస్సలు చెప్పకండి. బ్యాంకింగ్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…