మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ74 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్లను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ మోనో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ఒప్పో ఎ74 5జి స్మార్ట్ఫోన్ ఫ్లుయిడ్ బ్లాక్, ఫంటాస్టిక్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.17,990 ఉండగా అమెజాన్ ఆన్లైన్ స్టోర్తోపాటు అన్ని ఆఫ్లైన్ స్టోర్లలో దీన్ని ఏప్రిల్ 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్పై ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది. 2 ఏళ్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అందిస్తారు.
ఆఫ్లైన్ స్టోర్లలో అయితే హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్, కోటక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పేటీఎం ద్వారా అయితే 11 శాతం ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ అందిస్తారు. జీరో డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…