ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 15వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఓ దశలో ఛేదించేటట్లే కనబడింది. కానీ ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో కోల్కతాపై చెన్నై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లలో డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్లు అద్భుతంగా రాణించారు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో డుప్లెసిస్ 95 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ 64 పరుగులు చేశాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రు రస్సెల్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా 19.1 ఓవర్లలో ఆలౌట్ అయింది. 202 పరుగులు మాత్రమే చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో ప్యాట్ కమ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆండ్రు రస్సెల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, దినేష్ కార్తీక్ 24 బంతల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లు, లుంగి ఎంగిడిలు 3 వికెట్లు పడగొట్టారు. శామ్ కుర్రాన్కు 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…