చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 14వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో హైదరాబాద్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలిగింది. ఈ క్రమంలో పంజాబ్పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో ఎవరూ రాణించలేదు. మయాంగ్ అగర్వాల్, షారూఖ్ ఖాన్లు చెరో 22 పరుగులు చేశారు. జట్టును ఆదుకునే యత్నం చేసినా ఫలించలేదు. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్లలో జానీ బెయిర్స్టో, వార్నర్లు అద్భుతంగా రాణించారు. 56 బంతుల్లో బెయిర్ స్టో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే వార్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో ఫేబియన్ అలన్కు 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…