చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 14వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో హైదరాబాద్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలిగింది. ఈ క్రమంలో పంజాబ్పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో ఎవరూ రాణించలేదు. మయాంగ్ అగర్వాల్, షారూఖ్ ఖాన్లు చెరో 22 పరుగులు చేశారు. జట్టును ఆదుకునే యత్నం చేసినా ఫలించలేదు. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్లలో జానీ బెయిర్స్టో, వార్నర్లు అద్భుతంగా రాణించారు. 56 బంతుల్లో బెయిర్ స్టో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే వార్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో ఫేబియన్ అలన్కు 1 వికెట్ దక్కింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…