గ్యాడ్జెట్స్

ఒప్పో నుంచి త‌క్కువ ధ‌ర‌కే కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో చూడండి..!

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. ఎ53ఎస్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 8జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ కెమెరాల‌ను కూడా వెనుక‌వైపు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

ఒప్పో ఎ53ఎస్ 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
  • 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఒప్పో ఎ53ఎస్ 5జి స్మార్ట్ ఫోన్ క్రిస్ట‌ల్ బ్లూ, ఇంక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,990 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మెడ‌ల్ ధ‌ర రూ.16,990గా ఉంది. ఈ ఫోన్‌ను మే 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తారు.

లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.1250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. 1 ఏడాది పాటు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తారు. కేవ‌లం రూ.1కే 70 శాతం బై బ్యాక్ వాల్యూను అందిస్తారు. 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ప‌లు ప్ర‌ముఖ బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 6 నెలల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తారు. పేటీఎంతో కొనుగోలు చేస్తే 11 శాతం క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM