మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎ53ఎస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను అందిస్తున్నారు. ఈ ఫోన్కు వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాలను కూడా వెనుకవైపు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
ఒప్పో ఎ53ఎస్ 5జి స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,990 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మెడల్ ధర రూ.16,990గా ఉంది. ఈ ఫోన్ను మే 2వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్తోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్లో విక్రయిస్తారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్పై ఆఫర్లను అందిస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.1250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 1 ఏడాది పాటు ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తారు. కేవలం రూ.1కే 70 శాతం బై బ్యాక్ వాల్యూను అందిస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే పలు ప్రముఖ బ్యాంకులకు చెందిన కార్డులతో 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. జీరో డౌన్ పేమెంట్తో ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు. పేటీఎంతో కొనుగోలు చేస్తే 11 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…