గత కొద్ది రోజుల వరకు చికెన్ ధర మార్కెట్లో కేజీకి రూ.270 వరకు పలికిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో రూ.170కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్లు, లాక్డౌన్లు విధించడం, వాణిజ్య పరమైన వినియోగం తగ్గడం, రాత్రి కర్ఫ్యూలు వంటి అనేక కారణాల వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయి.
గతేడాది కరోనా ప్రభావం మొదలయ్యాక చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. కానీ తరువాత చికెన్ తినడం వల్ల కరోనా రాదని, పైగా చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పడంతో ప్రజలు చికెన్ బాగా తినడం మొదలు పెట్టారు. అయితే అప్పటి నుంచి చికెన్ ధరలు కొద్దిగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ధరలు మళ్లీ పడిపోయాయి.
కరోనా వల్ల చాలా చోట్ల ఆంక్షలను విధించారు. ఫంక్షన్లు, సభలు, సమావేశాలు జరగడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ వినియోగం తగ్గింది. దీంతో డిమాండ్ 30 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అందువల్లే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇక మరోవైపు వేసవిలో కోడిపిల్లలను కాపాడడం కూడా పౌల్ట్రీ రైతులకు కష్టంగా మారింది. సాధారణంగా ఒక కోడికి రూ.90 వరకు ఖర్చు పెట్టాలి. కానీ ప్రస్తుతం కిలో బరువున్న కోడిని రూ.66కే విక్రయించాల్సి వస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.
అయితే బ్రాయిలర్ కోళ్ల ధరలు పడిపోతున్నప్పటికీ మరోవైపు నాటుకోళ్లు, మటన్లకు గిరాకీ తగ్గలేదు. ఇంకా పెరిగింది. దీంతో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి. నాటుకోడి కేజీ ధర రూ.400 వరకు పలుకుతోంది. కడక్నాథ్ కోడి మాంసం అయితే కేజీకి రూ.500 పైగానే పలుకుతోంది. ఇక మటన్ ధర రూ.800 వరకు ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. అదే జరిగితే పౌల్ట్రీ రైతులకు ఇంకా భారీ నష్టాలు తప్పవనే తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గి వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటేనే గానీ కోళ్ల ధరలు పెరిగే అవకాశం లేదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…