భారీగా త‌గ్గిన బ్రాయిల‌ర్ చికెన్ ధ‌ర‌లు.. నాటుకోళ్లు, మ‌ట‌న్ ధ‌ర‌లు పైపైకి..

April 28, 2021 12:37 PM

గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు చికెన్ ధ‌ర మార్కెట్‌లో కేజీకి రూ.270 వ‌ర‌కు ప‌లికిన విష‌యం విదిత‌మే. అయితే ప్ర‌స్తుతం చికెన్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. కిలో రూ.170కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు విధించ‌డం, వాణిజ్య ప‌ర‌మైన వినియోగం త‌గ్గ‌డం, రాత్రి క‌ర్ఫ్యూలు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చికెన్ ధ‌ర‌లు భారీగా తగ్గాయి.

broiler chicken prices down

గ‌తేడాది క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌య్యాక చికెన్ ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయి. కానీ త‌రువాత చికెన్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని, పైగా చికెన్ తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు చికెన్ బాగా తిన‌డం మొద‌లు పెట్టారు. అయితే అప్ప‌టి నుంచి చికెన్ ధ‌ర‌లు కొద్దిగా పెరుగుతూ, కొద్దిగా త‌గ్గుతూ వ‌చ్చాయి. కానీ ప్ర‌స్తుతం ధ‌ర‌లు మ‌ళ్లీ ప‌డిపోయాయి.

క‌రోనా వ‌ల్ల చాలా చోట్ల ఆంక్ష‌ల‌ను విధించారు. ఫంక్ష‌న్లు, స‌భ‌లు, స‌మావేశాలు జ‌ర‌గ‌డం లేదు. హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లోనూ వినియోగం త‌గ్గింది. దీంతో డిమాండ్ 30 శాతం వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అందువల్లే చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. ఇక మ‌రోవైపు వేస‌విలో కోడిపిల్ల‌ల‌ను కాపాడ‌డం కూడా పౌల్ట్రీ రైతుల‌కు క‌ష్టంగా మారింది. సాధార‌ణంగా ఒక కోడికి రూ.90 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాలి. కానీ ప్ర‌స్తుతం కిలో బ‌రువున్న కోడిని రూ.66కే విక్ర‌యించాల్సి వస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు భారీ న‌ష్టాల‌ను చ‌వి చూస్తున్నారు.

అయితే బ్రాయిల‌ర్ కోళ్ల ధ‌ర‌లు ప‌డిపోతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు నాటుకోళ్లు, మ‌ట‌న్‌ల‌కు గిరాకీ త‌గ్గ‌లేదు. ఇంకా పెరిగింది. దీంతో వాటి ధ‌ర‌లు పైపైకి వెళ్తున్నాయి. నాటుకోడి కేజీ ధ‌ర రూ.400 వ‌ర‌కు ప‌లుకుతోంది. క‌డ‌క్‌నాథ్ కోడి మాంసం అయితే కేజీకి రూ.500 పైగానే ప‌లుకుతోంది. ఇక మ‌ట‌న్ ధ‌ర రూ.800 వ‌ర‌కు ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. అదే జరిగితే పౌల్ట్రీ రైతుల‌కు ఇంకా భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌నే తెలుస్తోంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి వ్యాపారాలు మ‌ళ్లీ పుంజుకుంటేనే గానీ కోళ్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం లేదు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment