కరోనా నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ఈ మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందా ? అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు కోవిడ్ రాకుండా అనేక జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన డిజిటల్ పరికరాలను ఇంట్లో ఉంచుకుంటే దాంతో కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మరి ఆ పరికరాలు ఏమిటంటే..
దీని సహాయంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీని ద్వారా రోజూ పరీక్ష చేసుకోవాలి. కోవిడ్ లక్షణాలు లేకున్నా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే వెంటనే అలర్ట్ అయి చికిత్స తీసుకోవచ్చు. అందుకని ఈ మీటర్ను కచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎమర్జెన్సీ సమయాల్లో మనకు ఆక్సిజన్ను అందిస్తుంది. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఈ-కామర్స్ సైట్లలోనూ లభిస్తుంది. కనుక కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండాలంటే దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.
దీని సహాయంతో వ్యక్తులను టచ్ చేయకుండానే 2 లేదా 3 ఇంచుల దూరం నుంచే వ్యక్తి ఉష్ణోగ్రతను కొలవచ్చు. జ్వరం ఉందీ, లేనిదీ సులభంగా తెలుస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండవచ్చు. కనుక దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం.
పల్స్, బీపీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక ఈ మీటర్ను కూడా ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం.
దీని వల్ల ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవచ్చు. కోవిడ్ సమయంలో ఇది ఎంతగానో పనిచేస్తుంది. అసాధారణ రీతిలో షుగర్ లెవల్స్ ఉంటే వెంటనే తెలిసిపోతుంది. జాగ్రత్త పడవచ్చు. దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.
ఈ పరికరాలన్నింటినీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కోవిడ్ సమయంలో మనం మన ఆరోగ్యాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…