టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ను అందిస్తోంది. వారి కోసం ఎయిర్టెల్ కొత్తగా పలు ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఏడాది వ్యవధి గల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్టెల్ సంస్థ కొత్తగా రూ.499, రూ.699, రూ.2798 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రూ.499 ప్లాన్ను రీచార్జి చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. దీంతోపాటు 1 ఏడాది వ్యవధి గల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ 3 నెలల మెంబర్షిప్ ఉచితంగా వస్తుంది. దీంతోపాటు షా అకాడమీ నుంచి ఉచిత కోర్సులు లభిస్తాయి.
ఇక రూ.699 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. రూ.2798 ప్లాన్లో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. కాల్స్, మెసేజ్ లు కూడా వస్తాయి. ఇక రూ.699, రూ.2798 ప్లాన్లకు కూడా హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. రూ.499 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.699 ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. రూ.2798 ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.
అయితే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ను వాడుతున్న కస్టమర్లు రూ.499 ఆపైన విలువ గల ప్లాన్లను తీసుకుంటే వారికి ఎలాంటి అదనపు చార్జి లేకుండానే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందుకు గాను వారు ఎయిర్ టెల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఇచ్చే థ్యాంక్స్ బెనిఫిట్స్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…