ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 18వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్కతాపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్కతా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో రాహుల్ త్రిపాఠి మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 26 బంతులు ఆడిన త్రిపాఠి 1 ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనడ్కట్, చేతన్ శకారియా, ముస్తాఫిజుర్ రహమాన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కెప్టెన్ సంజు శాంసన్ రాణించాడు. 41 బంతులు ఆడిన శాంసన్ 2 ఫోర్లు, 1 సిక్సర్తో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణలకు చెరొక వికెట్ దక్కింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…