ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 18వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్కతాపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్కతా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో రాహుల్ త్రిపాఠి మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 26 బంతులు ఆడిన త్రిపాఠి 1 ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనడ్కట్, చేతన్ శకారియా, ముస్తాఫిజుర్ రహమాన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కెప్టెన్ సంజు శాంసన్ రాణించాడు. 41 బంతులు ఆడిన శాంసన్ 2 ఫోర్లు, 1 సిక్సర్తో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణలకు చెరొక వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…