కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల భారత్లో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో రోజుకు 10 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు అనేక రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హాస్పిటళ్లలో బెడ్లు నిండిపోయాయి. ఒక రోగి బెడ్ను ఖాళీ చేస్తేగానీ ఇంకో రోగికి బెడ్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇక ఇతర వైద్య సదుపాయాలు కూడా మృగ్యమయ్యాయి. దీంతో ఇతర దేశాలు భారత్కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
కాగా పాకిస్థాన్లోని కరాచీకి చెందిన అబ్దుల్ సత్తార్ ఎధి ఫౌండేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తాము పాకిస్థాన్లో 1800 ఆంబులెన్స్ల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నామని, భారత్ అనుమతిస్తే వాటిల్లోంచి 50 ఆంబులెన్స్లను భారత్కు పంపుతామని, వాటితోపాటు సిబ్బంది కూడా వస్తారని ఆ ట్రస్టు తెలిపింది. ఈ మేరకు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఫైసల్ ఎధి మీడియాకు తెలిపారు.
భారత్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఫైసల్ ఎధి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్ విలవిలలాడుతుందని, కానీ పాకిస్థాన్లో కోవిడ్ ఉధృతి అంతగా లేదని, కనుక తాము తమ ఆంబులెన్స్లను భారత్కు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…