మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ 11ఎక్స్, 11ఎక్స్ ప్రొ పేరిట రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వీటికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఎంఐ11ఎక్స్ లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ను ఏర్పాటు చేయగా, 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ను అమర్చారు. రెండింటిలోనూ 8జీబీ ర్యామ్ లభిస్తుంది.
ఎంఐ 11ఎక్స్ లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 11ఎక్స్ ప్రొ లో 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 5 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ రెండింటిలోనూ వెనుక వైపు ఉన్నాయి. డాల్బీ అట్మోస్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను వీటిల్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనుక వీటిని 52 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ చేయవచ్చు.
షియోమీ ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్లు సెలెస్టియల్ సిల్వర్, లూనార్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. ఎంఐ11ఎక్స్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 గా ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999గా ఉంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ను అమెజాన్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్లో విక్రయిస్తారు.
ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.41,999గా ఉంది. ఈ ఫోన్ను అమెజాన్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్లలో విక్రయిస్తున్నారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఎంఐ 11ఎక్స్ ఫోన్పై రూ.3500, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్పై రూ.4000 క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఎంఐ 11ఎక్స్ను కొన్నవారు ఎంఐ బ్యాండ్ 5 ను రూ.500 కే కొనుగోలు చేయవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…