ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 28వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ తడబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఏ దశలోనూ పరుగులు చేద్దామని హైదరాబాద్ బ్యాట్స్మెన్ అనుకోలేదు. చెత్త షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో హైదరాబాద్పై రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో జాస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్లు రాణించారు. 64 బంతుల్లో బట్లర్ 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. 33 బంతుల్లో శాంసన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్, క్రిస్ మోరిస్లు 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియాలకు చెరొక వికెట్ దక్కింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…