IPL 2021 : కరోనా కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఐపీఎల్ 2021 వాయిదా పడి తాజాగా మళ్లీ మొదలైంది. ఆదివారం నాటి మ్యాచ్తో మరోసారి ఐపీఎల్ జోష్ తెచ్చింది. మొదటి దశలో 29 మ్యాచ్లు జరగ్గా ఆదివారం 30వ మ్యాచ్ తో మళ్లీ ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబైలు తలపడగా.. విజయం చెన్నైని వరించింది.
టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓ దశలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న చెన్నైని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, బ్రేవోలు ఆదుకున్నారు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో రుతురాజ్ 88 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, జడేజా 26, బ్రేవో 23 పరుగులు చేశారు. దీంతో చెన్నై చెప్పుకోదగిన స్కోరు చేయగలిగింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె, బుమ్రాలకు తలా 2 వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులను మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాట్స్మెన్లలో సౌరభ్ తివారీ ఒక్కడే రాణించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. 40 బంతులు ఆడిన తివారీ 5 ఫోర్లతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. జోష్ హేజల్వుడ్, శార్దూల్ ఠాకూర్లకు చెరొక వికెట్ దక్కింది. ఈ క్రమంలో ముంబైపై చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…