ఐపీఎల్ 2021 ఎడిషన్ కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మొదటి దశలో 29 మ్యాచ్లను నిర్వహించారు. ఈ క్రమంలోనే మరో 31 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 19 నుంచి ఆ మ్యాచ్లను నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లన్నింటినీ యూఏఈలోనే నిర్వహిస్తారు. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ వివరాలను వెల్లడించింది.
సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 10, 11, 13 తేదీల్లో క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతాయి. అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్లలో 13 మ్యాచ్లు దుబాయ్లో, 10 షార్జాలో, 8 అబుధాబిలో జరుగుతాయి.
కాగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలు టాప్ 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ షెడ్యూల్లో విదేశీ ప్లేయర్లు చాలా మంది పాల్గొనడం లేదు. ఐపీఎల్ రెండో షెడ్యూల్కు కొద్ది రోజుల తరువాతే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో చాలా జట్లు తమ ప్లేయర్లను ఐపీఎల్లో ఆడించేందుకు నిరాకరించాయి. దీంతో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఈ షెడ్యూల్లో కనిపించరు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…