ఐపీఎల్ 2021 ఎడిషన్ కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మొదటి దశలో 29 మ్యాచ్లను నిర్వహించారు. ఈ క్రమంలోనే మరో 31 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 19 నుంచి ఆ మ్యాచ్లను నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లన్నింటినీ యూఏఈలోనే నిర్వహిస్తారు. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ వివరాలను వెల్లడించింది.
సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 10, 11, 13 తేదీల్లో క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతాయి. అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్లలో 13 మ్యాచ్లు దుబాయ్లో, 10 షార్జాలో, 8 అబుధాబిలో జరుగుతాయి.
కాగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలు టాప్ 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ షెడ్యూల్లో విదేశీ ప్లేయర్లు చాలా మంది పాల్గొనడం లేదు. ఐపీఎల్ రెండో షెడ్యూల్కు కొద్ది రోజుల తరువాతే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో చాలా జట్లు తమ ప్లేయర్లను ఐపీఎల్లో ఆడించేందుకు నిరాకరించాయి. దీంతో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఈ షెడ్యూల్లో కనిపించరు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…