చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ 6వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ ఛేదించలేక చతికిలబడింది. పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. దీంతో హైదరాబాద్పై బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచి హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగళూరు బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో గ్లెన్ మాక్స్వెల్, కోహ్లిలు రాణించారు. 41 బంతులు ఆడిన మాక్స్వెల్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేయగా 29 బంతుల్లో కోహ్లి 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, టి.నటరాజన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో డేవిడ్ వార్నర్, మనీష్ పాండేలు రాణించారు. 37 బంతులు ఆడిన వార్నర్ 7 ఫోర్లు, 1 సిక్సర్తో 54 పరుగులు చేయగా, 39 బంతులు ఆడిన పాండే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో షాబాద్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ లు చెరో 2 వికెట్లు తీశారు. కైలీ జేమిసన్కు 1 వికెట్ దక్కింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…