ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఎక్కువైపోయాయి. ప్రజలు ఏం కావాలన్నా చాలా వరకు ఆన్లైన్లోనే ఆర్డర్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇష్టమైన ఫుడ్ కావాలంటే చాలా దూరంలో ఉన్న రెస్టారెంట్కు వెళ్లక్కర్లేదు. ఆన్లైన్ యాప్లో ఆర్డర్ పెడితే చాలు. గంట లోపే కావల్సిన ఫుడ్ నేరుగా ఇంటికే చేరుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే మనకు ఫుడ్ అందించేందుకు డెలివరీ బాయ్స్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు సకాలంలో ఫుడ్ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. కొద్దిగా ఆలస్యమైనా వారి జీతంలో కోత పడుతుంది. దీంతోపాటు వారు రోజూ అధిక మొత్తంలో ఆర్డర్లను తక్కువ సమయంలో డెలివరీ చేయాల్సి ఉంటుంది.
ఇలా డెలివరీ బాయ్స్ మనకు ఫుడ్ను డెలివరీ చేసేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఓ డెలివరీ బాయ్కి మాత్రం కొండంత కష్టం వచ్చింది. దీంతో అతను వీధుల్లో తిరుగుతూ అందరినీ డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఢిల్లీలోని జీటీబీ నగర్లో ఓ జొమాటో డెలివరీ బాయ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అందరినీ డబ్బులు అడుగుతున్నాడు. కొద్ది రోజుల్లో తన సోదరి వివాహం ఉందని, అందుకు గాను తాను ఖర్చు పెట్టకుండా పైసా పైసా కూడబెట్టానని, కానీ ఇప్పుడు జొమాటోలో తన అకౌంట్ బ్లాక్ అయిందని, తన సోదరి వివాహం ఏం పెట్టి చేయాలని అతను భోరున విలపిస్తూ అందరినీ సహాయం చేయాలని అడగసాగాడు.
అయితే అతని దీనగాథను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ జొమాటోకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయసాగారు. ఇందుకు స్పందించిన జొమాటో వెంటనే యాక్షన్ తీసుకుంటామని, ఆ వ్యక్తికి న్యాయం చేస్తామని, తమకు కస్టమర్లు ఎలాగో డెలివరీ బాయ్స్ కూడా అలాగేనని, వారిని ఆదుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా డెలివరీ బాయ్స్ జీవితాలు ఎలా ఉంటాయో మరోసారి ఈ సంఘటన ద్వారా నిరూపితం అయింది.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…