Tata Docomo : టాటా డొకోమో కొన్ని ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో ఊపందుకుంది. భారతదేశంలో ఎక్కువ శాతం మంది డొకోమోని వాడేవారు. దానికి కారణం ఏంటంటే, సెకండ్ కి పైసా సర్వీస్ ని డొకోమో స్టార్ట్ చేసింది. అంతేకాకుండా, సిగ్నల్ కూడా బాగా వచ్చేదట. అయితే, సడన్ గా డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి ఎందుకు అంత క్రేజ్ ని తెచ్చుకున్న డొకోమో ఆగిపోయింది, దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ కి చెందిన ఎన్టీటీ డొకోమోతో, టాటా సంస్థ డొకోమోనీ టాటాడొకోమోగా భారత దేశంలో మొదలుపెట్టారు.
ఆ టైంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని, డబ్బులు ని కట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే, డోకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేయడం జరిగింది. ఈ కారణంగా, మిగిలిన కంపెనీలు కూడా, ఇలానే సెకండ్ కి ఇంత అని, డబ్బులు కట్ చేయడం మొదలుపెట్టారు. మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్, 15 నుండి 12 శాతానికి తగ్గిపోయింది. మొబైల్ ను ఉపయోగించే వాళ్ళకి, ఇది ఈజీ అయ్యింది. డబ్బులు తక్కువ అవుతున్నాయి కాబట్టి, ఇదే బాగుందని ఇలానే మొదలుపెట్టారు.
కానీ, కంపెనీ రెవిన్యూ మాత్రం బాగా తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టిటి డొకోమో ఈ వెంచర్ కోసం దాదాపు 14 వేల కోట్ల రూపాయలని, ఇన్వెస్ట్ చేశారు. 2010 స్కామ్ బయటకు వచ్చింది. 2010లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, టెలికాం శాఖ లైసెన్స్ విషయంలో, చేసిన పొరపాటుకు సంబంధించి నివేదికను వెల్లడించింది. 2జీ లైసెన్సులు జారీ చేయడం వలన, 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించింది. 2జీ స్కామ్ వలన డొకోమో మీద ప్రభావం గట్టిగా పడింది.
టాటా టెలి సర్వీస్ సరైన మార్గంలో వెళ్లలేదు. కంపెనీ టెలిఫోన్ టవర్ల సంఖ్యని తగ్గించేశారు. షేర్స్ లో కూడా, వాటా తగ్గుతూ వచ్చింది. డొకోమో, టాటా టెలి సర్వీసెస్ మధ్య అభిప్రాయ బేధాలు కూడా వచ్చాయి. ఎయిర్ సెల్ కి ముందు అమ్మేద్దాం అనుకున్నారు. తర్వాత వోడాఫోన్ కి అమ్మేద్దాం అని అనుకున్నారు. డొకోమో 3జీ సర్వీసెస్ ని తీసుకువచ్చింది. కానీ సరిగ్గా ఉపయోగించలేదు.
డొకోమో డబ్బులు తీసుకుని, టాటా సర్వీసెస్ నుండి వెళ్ళిపోయింది. 2017 ప్రకారం టాటా డొకోమోకి కేవలం 3.16% యూజర్లు ఉన్నారు. అంటే 42 లక్షల మంది యూజర్లు. జియో రావడంతో, మెల్లగా యూజర్లు తగ్గిపోయారు. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేసింది. 4,617 కోట్ల నష్టం టాటా టెలి సర్వీసెస్ కి రావడంతో, టాటా డొకోమో సేవలు ని ఆపేసారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…