ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలా మంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరి ఇళ్లల్లో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును.. గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
టాయిలెట్ సీట్స్ను సాధారణంగా పోర్సిలెయిన్ అనే సెరామిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. అది సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది. దానికి ఇతర రంగులను కలపాల్సిన పనిలేదు. పైగా అలా ఉంచితేనే తక్కువ ధర ఉంటాయి. రంగులు కలిపితే ధర పెంచాల్సి వస్తుంది. అందుకని వాటిని తయారు చేశాక వాటికి వచ్చే సహజమైన తెలుపు రంగులోనే వాటిని ఉంచుతారు. అలాగే విక్రయిస్తారు. అందుకనే టాయిలెట్ సీట్లు సహజంగానే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి.
ఇక తెలుపు కాకుండా మిగిలిన ఏ రంగుల్లో టాయిలెట్ సీట్లు ఉన్నా సరే వాటిపై మురికి సరిగ్గా కనిపించదు. తెలుపు రంగు అయితేనే మురికి సరిగ్గా కనిపిస్తుంది. పైగా తెలుపు రంగుతో ఉన్న టాయిలెట్ సీట్ను క్లీన్ చేస్తే అది తెల్లగా మెరుస్తుంది. దీంతో సంతృప్తి కలుగుతుంది. అదే ఇతర రంగుల్లో ఉండే టాయిలెట్ సీట్లను శుభ్రం చేసినా తెలుపులా మెరవవు. కనుక సీట్ శుభ్రం అయిందా, కాలేదా అనే విషయం గుర్తించడం కష్టతరం అవుతుంది. అందుకనే టాయిలెట్ సీట్లను సహజంగానే తెలుపు రంగులో ఉండేట్లు తయారు చేస్తారు. అలాగే విక్రయిస్తారు. అవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉండడం వెనుక ఈ కారణాలు ఉన్నాయన్నమాట.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…