Gold : కర్ణాటక రాష్ట్రంలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు బంగారు చెయిన్ ను మింగేసింది. దీంతో దాన్ని సర్జరీ చేసి తీసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డె అనే కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి.
కాగా ఇటీవల దీపావళి సందర్భంగా ఇంట్లో ఆవులకు గోపూజ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆవులకు పూలమాలలు, బంగారు ఆభరణాలను వేసి పూజలు చేశారు. పూజల అనంతరం వాటిని తీసేశారు. అయితే ఓ ఆవు దూడ మెడకు 20 గ్రాముల బంగారు చెయిన్ను వేశారు. అది పూలమాలలో కలిసిపోయి ఉంది. దీంతో ఆ దూడ దాన్ని తినేసింది. ఆ చెయిన్ కాస్తా దాని పొట్టలోకి వెళ్లిపోయింది.
అయితే పూజలో ఉపయోగించిన చెయిన్ కనిపించడం లేదని ఆ కుటుంబ చెయిన్ కోసం ఎంతగానో వెదికింది. అయినప్పటికీ ఫలితం లేదు. అలా వారు నెల రోజులుగా ఆవుల షెడ్లు, వాటి పేడలో చెక్ చేస్తూ వచ్చారు. చివరకు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించి చూడగా దాని పొట్టలో చెయిన్ ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే డాక్టర్ ఆ ఆవుకు సర్జరీ చేసి చెయిన్ను బయటకు తీశారు. అయితే 20 గ్రాములు ఉండాల్సిన ఆ చెయిన్ కాస్తా 18 గ్రాముల బరువు తూగింది. మిగిలిన రెండు గ్రాములు ఆవు పొట్టలోని యాసిడ్ల వల్ల కరిగిపోయిందని తేలింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ చెయిన్ పూర్తిగా కరిగిపోయి ఉండేదన్నమాట. అయితే ఆ ఆవు ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…