Gold : కర్ణాటక రాష్ట్రంలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు బంగారు చెయిన్ ను మింగేసింది. దీంతో దాన్ని సర్జరీ చేసి తీసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డె అనే కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి.
కాగా ఇటీవల దీపావళి సందర్భంగా ఇంట్లో ఆవులకు గోపూజ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆవులకు పూలమాలలు, బంగారు ఆభరణాలను వేసి పూజలు చేశారు. పూజల అనంతరం వాటిని తీసేశారు. అయితే ఓ ఆవు దూడ మెడకు 20 గ్రాముల బంగారు చెయిన్ను వేశారు. అది పూలమాలలో కలిసిపోయి ఉంది. దీంతో ఆ దూడ దాన్ని తినేసింది. ఆ చెయిన్ కాస్తా దాని పొట్టలోకి వెళ్లిపోయింది.
అయితే పూజలో ఉపయోగించిన చెయిన్ కనిపించడం లేదని ఆ కుటుంబ చెయిన్ కోసం ఎంతగానో వెదికింది. అయినప్పటికీ ఫలితం లేదు. అలా వారు నెల రోజులుగా ఆవుల షెడ్లు, వాటి పేడలో చెక్ చేస్తూ వచ్చారు. చివరకు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించి చూడగా దాని పొట్టలో చెయిన్ ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే డాక్టర్ ఆ ఆవుకు సర్జరీ చేసి చెయిన్ను బయటకు తీశారు. అయితే 20 గ్రాములు ఉండాల్సిన ఆ చెయిన్ కాస్తా 18 గ్రాముల బరువు తూగింది. మిగిలిన రెండు గ్రాములు ఆవు పొట్టలోని యాసిడ్ల వల్ల కరిగిపోయిందని తేలింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ చెయిన్ పూర్తిగా కరిగిపోయి ఉండేదన్నమాట. అయితే ఆ ఆవు ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…