ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో.. ఆ మహిళ తన 3 నెలల పసికందును చంపేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘర్ష్ సదన్ బిల్డింగ్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. ఆమెకు ఆడపిల్ల పుడుతుందని అంజనం వేసిన మాంత్రికులు చెప్పగా.. ఆడపిల్ల వద్దనుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించారు.
అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గత 3 నెలల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపులకు గురి చేయసాగారు.
ఆడపిల్లను కన్నావని తరచూ ఆ మహిళను నిందిస్తూ వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ మహిళ తన బిడ్డను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలను తీసింది. కానీ అందరికీ తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళ నేరం తానే చేశానని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్కు తరలించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…