ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో.. ఆ మహిళ తన 3 నెలల పసికందును చంపేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘర్ష్ సదన్ బిల్డింగ్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. ఆమెకు ఆడపిల్ల పుడుతుందని అంజనం వేసిన మాంత్రికులు చెప్పగా.. ఆడపిల్ల వద్దనుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించారు.
అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గత 3 నెలల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపులకు గురి చేయసాగారు.
ఆడపిల్లను కన్నావని తరచూ ఆ మహిళను నిందిస్తూ వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ మహిళ తన బిడ్డను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలను తీసింది. కానీ అందరికీ తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళ నేరం తానే చేశానని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్కు తరలించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…