ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో.. ఆ మహిళ తన 3 నెలల పసికందును చంపేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘర్ష్ సదన్ బిల్డింగ్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. ఆమెకు ఆడపిల్ల పుడుతుందని అంజనం వేసిన మాంత్రికులు చెప్పగా.. ఆడపిల్ల వద్దనుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించారు.
అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గత 3 నెలల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపులకు గురి చేయసాగారు.
ఆడపిల్లను కన్నావని తరచూ ఆ మహిళను నిందిస్తూ వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ మహిళ తన బిడ్డను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలను తీసింది. కానీ అందరికీ తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళ నేరం తానే చేశానని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్కు తరలించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…