Viral Video : సోషల్ మీడియాలో వ్యూస్ను తెప్పించుకోవడం కోసం కొందరు పడరాని పాట్లు పడుతూ వీడియోలు చేస్తున్నారు. గతంలో టిక్టాక్ ఉన్న సమయంలో చాలా మంది ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పుడు టిక్ టాక్ లేకపోయినా.. సరిగ్గా అలాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కనుకనే చాలా మంది ఇప్పటికీ ఆ విధంగా వీడియోలు చేయడం మానడం లేదు. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు అభాసుపాలవుతున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సరిగ్గా ఓ యువతికి కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాకర్ హుమైరా అస్గర్ అడవిలో ఓ చోట టిక్టాక్ వీడియో చేసేందుకు వెళ్లింది. వెంట సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఆమె వెళ్లీ వెళ్లగానే అడవి తగలబడడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె సిబ్బంది వద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. అయినప్పటికీ వారు మంటలను ఆర్పేందుకు యత్నం చేయలేదు. సరే.. మంటలను ఆర్పకపోయినా.. కనీసం అడవి తగలబడుతుందన్న విచారం కూడా లేదు. ఆమె టిక్టాక్ వీడియో చేసింది. అనంతరం దాన్ని పోస్ట్ చేసింది.
అయితే ఆమె టిక్టాక్ వీడియో బ్యాక్ ఫైర్ అయింది. వ్యూస్, లైక్స్ కోసం ఆమె పెట్టినా.. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. అడవి తగలబడుతుంటే చోద్యం చూస్తూ టిక్ టాక్ వీడియో చేస్తావా.. అంటూ ఆమెపై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే తరువాత ఇంకో వీడియో ద్వారా ఆమె దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాను, తన సిబ్బంది అక్కడికి వెళ్లగానే మంటలు ప్రారంభమయ్యాయని.. ఇందులో తమ తప్పు ఏమీ లేదని.. మంటలను తాము అంటించలేమని ఆమె తెలియజేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని తాము ఇదే విషయం అడిగామని.. తాను ఈ మంటలను అంటించినట్లు అతను ఒప్పుకున్నాడని.. కనుక ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇస్లామాబాద్ అటవీ శాఖ అధికారులను కోరింది. ఆ వ్యక్తి అక్కడ భారీ పాములు ఉన్నాయని చెప్పి.. వాటిని తరిమేందుకు అక్కడ మంట పెట్టినట్లు అంగీకరించాడు. అయితే వివాదం సద్దుమణిగినా ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరంతే.. మన చుట్టూ ఏం జరుగుతుందో కనీస జ్ఞానం తెలియకుండా ప్రవర్తిస్తే అలాగే జరుగుతుంది మరి..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…