Viral Video : సోషల్ మీడియాలో వ్యూస్ను తెప్పించుకోవడం కోసం కొందరు పడరాని పాట్లు పడుతూ వీడియోలు చేస్తున్నారు. గతంలో టిక్టాక్ ఉన్న సమయంలో చాలా మంది ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పుడు టిక్ టాక్ లేకపోయినా.. సరిగ్గా అలాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కనుకనే చాలా మంది ఇప్పటికీ ఆ విధంగా వీడియోలు చేయడం మానడం లేదు. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు అభాసుపాలవుతున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సరిగ్గా ఓ యువతికి కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాకర్ హుమైరా అస్గర్ అడవిలో ఓ చోట టిక్టాక్ వీడియో చేసేందుకు వెళ్లింది. వెంట సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఆమె వెళ్లీ వెళ్లగానే అడవి తగలబడడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె సిబ్బంది వద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. అయినప్పటికీ వారు మంటలను ఆర్పేందుకు యత్నం చేయలేదు. సరే.. మంటలను ఆర్పకపోయినా.. కనీసం అడవి తగలబడుతుందన్న విచారం కూడా లేదు. ఆమె టిక్టాక్ వీడియో చేసింది. అనంతరం దాన్ని పోస్ట్ చేసింది.
అయితే ఆమె టిక్టాక్ వీడియో బ్యాక్ ఫైర్ అయింది. వ్యూస్, లైక్స్ కోసం ఆమె పెట్టినా.. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. అడవి తగలబడుతుంటే చోద్యం చూస్తూ టిక్ టాక్ వీడియో చేస్తావా.. అంటూ ఆమెపై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే తరువాత ఇంకో వీడియో ద్వారా ఆమె దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాను, తన సిబ్బంది అక్కడికి వెళ్లగానే మంటలు ప్రారంభమయ్యాయని.. ఇందులో తమ తప్పు ఏమీ లేదని.. మంటలను తాము అంటించలేమని ఆమె తెలియజేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని తాము ఇదే విషయం అడిగామని.. తాను ఈ మంటలను అంటించినట్లు అతను ఒప్పుకున్నాడని.. కనుక ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇస్లామాబాద్ అటవీ శాఖ అధికారులను కోరింది. ఆ వ్యక్తి అక్కడ భారీ పాములు ఉన్నాయని చెప్పి.. వాటిని తరిమేందుకు అక్కడ మంట పెట్టినట్లు అంగీకరించాడు. అయితే వివాదం సద్దుమణిగినా ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరంతే.. మన చుట్టూ ఏం జరుగుతుందో కనీస జ్ఞానం తెలియకుండా ప్రవర్తిస్తే అలాగే జరుగుతుంది మరి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…