Woman : ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిత్యం ఏదో ఒక సమయంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమకు ఎదురయ్యే సంఘటనలపై పోరాటం చేస్తారు. ధైర్యంగా వారు పురుషులను ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్పేబోయే మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తనను వేధించిన ఓ ఆకతాయికి చాలా గట్టిగా బుద్ధి చెప్పింది. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని ధార్ అనే ప్రాంతం నుంచి ఓల్డ్ నిసార్పూర్ అనే ప్రాంతానికి వెళ్లేందుకు ఒక మహిళ బస్ స్టాండ్ వద్ద నిలుచుని ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ మహిళ ఉగ్ర రూపం దాల్చింది. పారిపోతున్న ఆ యువకుడిని పట్టుకునేందుకు యత్నించింది. కానీ అతను దొరకలేదు.
చివరకు ఆ యువకుడు తన ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయినప్పటికీ ఆ మహిళ అతన్ని విడిచిపెట్టలేదు. వెంటబడి మరీ పట్టుకుంది. బయటకు ఈడ్చుకు వచ్చింది. అనంతరం అతని దుస్తులను మొత్తం విప్పేసి నగ్నంగా బజారులో నిలబెట్టింది. ఆ తరువాత ఒక రేంజ్లో అతన్ని ఆమె చితకబాదింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్గా మారింది. సదరు మహిళ ధైర్యానికి నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఆ ఘటన అనంతరం ఆ మహిళ ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది. అంతేకాకుండా అతనిపై కేసు పెట్టింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…