ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి బ్రహ్మాస్త్రను ప్రచారం చేయడంతో సినిమాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జక్కన్న బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య రాజమౌళి టీమ్తో కలిసి చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇక తాజాగా హైదరాబాద్లో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన హాజరుకానున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి తన ఫ్రెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నాడు. బ్రహ్మాస్త్ర మూవీలో రాజమౌళి సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వడాన్ని బట్టి చూస్తే.. జక్కన్న ఈ మూవీకి సమర్పకుడిగా మాత్రమే కాదని, వాస్తవానికి సినిమా రిటర్న్స్లో వాటాను కలిగి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ఇక్కడ మార్కెట్ చేసేందుకు మేకర్స్ రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర మూవీతో రాజమౌళి ఎంత సంపాదిస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది. సినిమా స్థాయిని బట్టి అతను కచ్చితంగా ఫ్యాన్సీ అమౌంట్ ని జేబులో వేసుకుంటాడు అని ఓ తెలుగు నెటిజన్ కామెంట్ చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి ప్రమోషన్స్ వల్ల బాలీవుడ్ కి పూర్వవైభవం వస్తుందో లేదో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…