వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజ జీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది.
చిత్ర పరిశ్రమలో నటీనటులకు రెమ్యునరేషన్ లు భారీగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే కుటుంబంలో హీరో హీరోయిన్ ఉంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిపై మరో విషయం వైరల్ గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సంపాదన కూడబెట్టారనే వార్త హల్ చల్ చేస్తోంది.
నాగ చైతన్యతో ఉన్నప్పటి కన్నా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆఫర్ల జోరు పెరిగిందనే చెప్పవచ్చు. విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను బాగా పెంచింది. నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు, టీవీ షోలు మరియు ప్రకటనల ద్వారా దాదాపు రూ.84 కోట్ల ఆదాయాన్ని సమంత కూడపెట్టిందనే సమాచారం వినిపిస్తోంది. కేవలం సినిమాలు, టీవీ షోల ద్వారానే కాకుండా సమంత సాకి అనే బ్రాండ్ కు సమంత ఓనర్ గా ఉంది. అదే విధంగా రెండు స్టార్టప్ లను కూడా ప్రారంభించి అదనపు ఆదాయాన్ని సంపాదించుకుంటోంది.
అక్కినేని వారసుడు నాగచైతన్య పుట్టుకతోనే వేలకోట్లు ఆస్తికి వారసుడు. నాగచైతన్య సమంతని పెళ్లి తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ రూ.40 కోట్ల వరకు సంపాదనను వెనక వేశాడట. వీళ్లు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దాదాపు రూ.122 కోట్ల వరకూ సంపాదించారని టాక్ వినిపిస్తోంది. సంపాదన పరంగా సక్సెస్ సాధించిన ఈ జంట నిజ జీవితంలో ఎందుకు ఫ్లాప్ అయ్యారు అనే విషయం మాత్రం అభిమానులకు ఇప్పటికి కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…