Ram Charan : సాధారణంగా ఎవరైనా సరే ఒక రంగంలో దూసుకుపోతున్నాడంటే అతనిపై ఎన్నో కళ్లు ఉంటాయి. కొందరు అలాంటి వారిని ప్రోత్సహిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అలాంటి వారంటే ఎల్లప్పుడూ అసూయను పెంచుకుంటారు. సరిగ్గా రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్తో పాన్ ఇండియా స్థాయి హీరోగా మారిన చరణ్.. పలువురు ప్రముఖ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. త్వరలోనే ప్రశాంత్ నీల్తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. అయితే చరణ్ కోసం చిరంజీవి ఇంకో ప్రముఖ దర్శకున్ని కూడా లైన్లో పెట్టారట. దీంతో చరణ్ పై కొందరు అసూయగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్టేటస్ ను చరణ్ దక్కించుకున్నాడు. గతంలో బాహుబలి ద్వారా ప్రభాస్కు కూడా ఇలాగే జరిగింది. అందుకనే ఆయన ఆ స్టేటస్ ను నిలబెట్టుకునేందుకు భారీ చిత్రాలనే చేస్తున్నారు. ఇక చరణ్ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నాడు. అందుకు ఆయనను తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక భారీ చిత్రం తరువాత అలాంటి చిత్రాన్నే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కనుకనే చరణ్ వరుసగా ప్రముఖ దర్శకులతో భారీ చిత్రాలను చేస్తున్నారు. అయితే శంకర్, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తరువాత చరణ్ లోకేష్ కనకరాజ్తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఓ వైపు సల్మాన్ ఖాన్తోపాటు కమల హాసన్, లోకేష్ కనకరాజ్ను కూడా సన్మానించారు. అయితే చరణ్తో ఓ సినిమా చేయాలని.. చిరు.. కనకరాజ్ను అడిగారట. దీంతో ఇందుకు ఆయన ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చరణ్ చేయనున్న వరుస సినిమాలు అన్నీ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. అయితే ఇతర హీరోలకు దక్కకుండా ఇలా చిరంజీవి తన కొడుకు కోసం ప్రముఖ దర్శకులను లాక్ చేయడం ఏమీ బాగాలేదని కొందరు అంటున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తన కొడుకు కోసం ఆయన అలా చేస్తున్నారని.. ఇందులో తప్పేముందని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు చరణ్పై ప్రస్తుతం గుర్రుగా ఉన్నారని.. ఆయనంటే అసూయను కనబరుస్తున్నారని తెలుస్తోంది. అయితే చరణ్ తీయనున్న ఆ మూడు సినిమాలు ఎలాంటి ప్రదర్శనను ఇస్తాయో చూడాలి. చిరంజీవి చేస్తున్న కృషి ఫలిస్తుందా.. లేదా.. అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…