Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటి వరకు చెప్పిన జాతకాలు, జ్యోతిష్యాలు ఎన్నో నిజమయ్యాయి. దీంతో ఈయన చెప్పే విషయాలపై చాలా మందికి నమ్మకం ఏర్పడింది. గతంలో జగన్ సీఎం అవుతారని ఈయన చెప్పారు. అన్నట్లే జగన్ సీఎం అయ్యారు. తరువాత సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పారు. అలాగే జరిగింది. ఆ తరువాత ప్రభాస్కు ఈ ఏడాదిలో పెళ్లి అవుతుందని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. అయితే ఇది ఇంకా జరగలేదు.. కానీ ప్రభాస్ పెళ్లి కన్ఫామ్ అవుతుందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇలా ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈయన తాజా ఓ ఇద్దరు సెలబ్రిటీలకు చెందిన జాతకాలు చూసి.. వారు విడిపోతారని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ అసలు ఆ సెలబ్రిటీ జంట ఎవరంటే..
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఈ మధ్యే నిక్కీ గల్రానిని వివాహం చేసుకున్న విషయం విదితమే. కన్నడ నటి సంజన గల్రానీ సోదరి ఈమె. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఈమె నటించింది. అయితే ఆది, నిక్కీ ఇద్దరూ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తరువాత వారి ప్రేమ కొన్నేళ్లపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే వారు ప్రేమ బంధానికి స్వస్తి చెప్పి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి జాతకాలు సరిపోలేదని.. వీరు వివాహం చేసుకున్నప్పటికీ కొంతకాలం అయ్యాక విడిపోతారని.. వేణు స్వామి జోస్యం చెప్పారు.
ఆది, నిక్కీ ఇద్దరూ ప్రేమ వ్యామోహంలో పడి వివాహం చేసుకున్నారని.. అయితే జాతకరీత్యా వారికి అసలు వివాహ బంధం అచ్చిరాదని.. వారు విడిపోతారని.. వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత, చైతన్య విడిపోతారని ఈయన ముందే చెప్పారు. అలాగే ఆయన చెప్పినట్లే జరిగింది. దీంతో ఆయన జ్యోతిష్యంపై చాలా మందికి గురి కుదిరింది. ఇక ఇప్పుడు ఆది, నిక్కీ ఇద్దరూ విడిపోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సారి ఆయన జ్యోతిష్యం ఏమవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…