Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటి వరకు చెప్పిన జాతకాలు, జ్యోతిష్యాలు ఎన్నో నిజమయ్యాయి. దీంతో ఈయన చెప్పే విషయాలపై చాలా మందికి నమ్మకం ఏర్పడింది. గతంలో జగన్ సీఎం అవుతారని ఈయన చెప్పారు. అన్నట్లే జగన్ సీఎం అయ్యారు. తరువాత సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పారు. అలాగే జరిగింది. ఆ తరువాత ప్రభాస్కు ఈ ఏడాదిలో పెళ్లి అవుతుందని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. అయితే ఇది ఇంకా జరగలేదు.. కానీ ప్రభాస్ పెళ్లి కన్ఫామ్ అవుతుందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇలా ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈయన తాజా ఓ ఇద్దరు సెలబ్రిటీలకు చెందిన జాతకాలు చూసి.. వారు విడిపోతారని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ అసలు ఆ సెలబ్రిటీ జంట ఎవరంటే..
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఈ మధ్యే నిక్కీ గల్రానిని వివాహం చేసుకున్న విషయం విదితమే. కన్నడ నటి సంజన గల్రానీ సోదరి ఈమె. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఈమె నటించింది. అయితే ఆది, నిక్కీ ఇద్దరూ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తరువాత వారి ప్రేమ కొన్నేళ్లపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే వారు ప్రేమ బంధానికి స్వస్తి చెప్పి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి జాతకాలు సరిపోలేదని.. వీరు వివాహం చేసుకున్నప్పటికీ కొంతకాలం అయ్యాక విడిపోతారని.. వేణు స్వామి జోస్యం చెప్పారు.
ఆది, నిక్కీ ఇద్దరూ ప్రేమ వ్యామోహంలో పడి వివాహం చేసుకున్నారని.. అయితే జాతకరీత్యా వారికి అసలు వివాహ బంధం అచ్చిరాదని.. వారు విడిపోతారని.. వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత, చైతన్య విడిపోతారని ఈయన ముందే చెప్పారు. అలాగే ఆయన చెప్పినట్లే జరిగింది. దీంతో ఆయన జ్యోతిష్యంపై చాలా మందికి గురి కుదిరింది. ఇక ఇప్పుడు ఆది, నిక్కీ ఇద్దరూ విడిపోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సారి ఆయన జ్యోతిష్యం ఏమవుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…