Paruchuri Venkateswara Rao : సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నో సినిమాలకు పని చేసిన విషయం తెలిసిందే. కేవలం రచయితగానే కాకుండా నటుడిగా కూడా అదరగొట్టారు. టాలీవుడ్లో దశాబ్దాల కాలంగా చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్స్ అందరి చిత్రాలకు రచనలు అందించారు పరుచూరి బ్రదర్స్. కొత్త తరం రావడంతో సహజంగానే వారి జోరు తగ్గింది. ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఆ ఫొటోలో పరుచూరిని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగానే మారింది. అంతగా మారిపోయారు. దీంతో ఆయనకు అంతు పట్టని వ్యాధి ఏదో సోకిందంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక ఆ ఫోటో నెట్టింట్లో బాగానే చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానల్లో స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 2017లో అన్నయ్య ఆస్ట్రేలియా వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం, శరీరంలో తేడాలు వచ్చాయి. వైద్య పరీక్షలు చేసుకుంటే డాక్టర్లు ఆహార నియమాలు ఫాలో కావాలి చెప్పారు. అంతకు మించి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.
జుట్టుకి రంగు వేసుకోకపోవడం.. బరువు తగ్గడం వల్ల అలా కనిపిస్తున్నారు. నేను కూడా రెండేళ్లలో 10 కిలోల బరువు తగ్గాను. ఫోటోలో అలా కనిపిస్తున్నారు అంతే. అలాంటి ఫోటో ఎందుకు షేర్ చేశావయ్యా అని జయంత్ ని ప్రశ్నించాను. ఈ ఫోటో చూసిన వారిలో తెలిసిన వ్యక్తి ఒకరు 80 ఏళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఇంకెలా ఉంటారు అని ప్రశ్నించారు. దీంతో నేను కరెక్ట్ గా చెప్పానని అన్నారని గోపాలకృష్ణ వీడియాలో స్పష్టం చేశారు. కాగా ఆ ఫోటోని జయంత్ పరాన్జీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ…
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…