NTR : ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించిన ఎన్టీఆర్ త్వరలో తన 30వ సినిమాలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించగా, ఎన్టీఆర్ హనమాన్ దీక్ష తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత తారక్ మాలధారణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే జూనియర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలిసారి ఎన్టీఆర్ స్వామి మాల ధరించగా, ఇంత సడెన్గా ఆయన దీక్ష ఎందుకు తీసుకున్నారనే ఆతృత అందరిలోనూ ఉంది.
ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు రామ్ చరణ్ ఇప్పుడు గురు స్వామి అయ్యారు. మరి ఆయన ఏమన్నా సూచించారా ? ఈ దీక్ష చేస్తే మంచిది అని ? ఎన్టీఆర్ తల్లి, భార్య కూడా దైవ భక్తి విషయంలో కాస్త గట్టి నమ్మకాలు ఉన్నవారే కాబట్టి వారేమైనా చెప్పారా ? లేదంటే ఎన్టీఆర్ జాతకరీత్యా ఎవరైనా పండితులైనా చెప్పి ఉంటారా.. అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ తన జాతకంలో ఉన్న దోషాల కారణంగానే హనుమాన్ దీక్ష చేపట్టారని.. దీంట్లో కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా కొంత మేర ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇక దీక్ష పూర్తయిన తర్వాత ఎన్టీఆర్.. కొరటాల మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన పక్కాగా స్కెచ్ వేసుకున్నారట. గతంలో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తీసి భారీ సక్సస్ అందుకున్నాడు. ఆచార్య ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాల ప్రశ్నలు కొరటాలకు ఎదురవుతున్నాయి. వీటిపై టాలీవుడ్ డైరెక్టర్ స్పందిస్తూ.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుందన్నారు కొరటాల శివ.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…