Pawan Kalyan : టాలీవుడ్లో మంచి స్టార్డమ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనని నటుడిగా కన్నా కూడా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ మంది ఫిదా అవుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ లైఫ్లో ఓ రిమార్క్ ఉంది. ప్రతిపక్షాలు ఇదే పాయింట్ని పట్టుకొని పవన్ని విమర్శిస్తుంటారు. మరి కొందరు మాత్రం ఈ విషయంలో పవన్ని వెనకేసుకొస్తుంటారు. ఫస్ట్ వైఫ్ ఇప్పటికీ కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్తుంది. ఆయన చెడ్డవాడు అయితే అంత ఫాలోయింగ్ ఎలా ఉంటుంది. చాలా మంది అంటుంటారు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అని. అది ఆయన ఇష్టం. నా లైఫ్ నాశనం చేశాడు ఈ పవన్ కళ్యాణ్ అని ఏ భార్యా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఆయన లీగల్గానే పెళ్లి చేసుకున్నాడు కదా, ముగ్గుర్ని అంటుంటారు. ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఇద్దరికి విడాకులు ఇచ్చాక రష్యా దేశస్థురాలు అన్నా లెజెనోవాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తీన్మార్ సినిమాలో అన్నా లెజెనోవా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ ఆమెతో ప్రేమలో పడ్డారు.
2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ ని మొదటిసారిగా కలిసింది అన్నా. అయితే ఆ సమయంలోనే పవన్, అన్నా లెజెనోవా మధ్య ప్రేమ పుట్టింది. వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. తరువాత పవన్ తన మాజీ భార్య రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అన్నా లెజెనోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళ గా మారిపోయారు. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలేనా అంజనా పవనోవాలు ఉన్నారు.
అన్నా లెజెనోవా మోడల్, నటి అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఎక్కువగా రష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అన్నా లెజొనోవా తన పిల్లలు ఇద్దరినీ సింగపూర్ లో చదివించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎకనామిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజెనోవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది అని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వారు అవాక్కవుతున్నారు. అయితే ఆమెకు ఉన్న ఆస్తులు అన్నీ సింగపూర్, రష్యాలలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…