Fish Business : సాధారణంగా మనకు అందుబాటులో చేపల ధరలు ఎంత ఉంటాయి. రూ.100 నుంచి రూ.1వేయి మధ్య ఉంటాయి. కానీ ఆ చేపలు మాత్రం వీటి కన్నా ఎన్నో రెట్ల ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అవే.. రెయిన్ బో ట్రౌట్ చేపలు. ఇవి మన దేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే లభిస్తాయి. అక్కడి మంచి నీటి సరస్సులలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. అక్కడ చాలా సరస్సుల వద్ద రోజుకు రూ.1వేయి చెల్లిస్తే వీటిని పట్టుకునే వీలు కల్పిస్తున్నారు. రోజుకు అలా రూ.1000 చెల్లించి 6 ట్రౌట్ చేపలను పట్టుకోవచ్చు. అంతకు మించి వీటిని పట్టుకోనివ్వరు. ఇక వీటిని బయట మార్కెట్లో కొనాలంటే కిలోకు దాదాపుగా రూ.2వేలు చెల్లించాల్సిందే. అంతటి ధరను ఇవి కలిగి ఉంటాయి.
ఇక ప్రస్తుతం మన దగ్గర కూడా ఈ చేపలను పెంచుతున్నారు. ఆదిత్య రిత్విక్ అనే యువకుడు రూ.25 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న కందుకూరు అనే ప్రాంతం వద్ద స్మార్ట్ గ్రీన్ అక్వాకల్చర్ అనే విధానంలో ఈ చేపలను పెంచుతున్నాడు. ఇవి అంత సులభంగా పెరగవు. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు వీటికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అలాంటి చల్లని నీటిలోనే ఇవి ఎక్కువగా పెరుగుతాయి. అలాగే వీటిలో పోషకాలు కూడా దండిగానే ఉంటాయి. వీటిని అమెరికన్లు ఎక్కువగా తింటుంటారు. కనుకనే ఈ చేపలు ఇంతటి ధరను కలిగి ఉంటాయి. ఇక ఇవి ఏడాదికి ఒకసారి చేతికి వస్తాయి.
అయితే వీటిని పెంచేందుకు కావల్సిన వాతావరణ పరిస్థితులను సృష్టించడం కష్టమే. ముఖ్యంగా వీటి కోసం ఎల్లప్పుడూ చల్లని నీరు అందుబాటులో ఉండాలి. అందుకు ఓ ప్రత్యేకమైన నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చల్లని నీరు నిరంతరంగా ఉంటేనే ఇవి మనుగడ సాగిస్తాయి. సులభంగా పెరుగుతాయి. అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లతోనే ఆదిత్య ఈ చేపలను పెంచుతున్నాడు. ఇక వీటిని త్వరలోనే హైదరాబాద్ మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. మరో 6 నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఈ చేపల పెంపకం యూనిట్లో రోజకు ఒక టన్ను చేపలను తీయవచ్చని ఆదిత్య తెలిపాడు. ఇక ఒక్కో చేప ఏడాదిలో సుమారుగా 1.50 కిలోల బరువు పెరుగుతుందని.. హైదరాబాద్ మార్కెట్లో వీటిని విక్రయించడంతోపాటు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తామని తెలిపాడు. అయితే రెయిన్బో ట్రౌట్ చేపల పెంపకం పట్ల ప్రస్తుతం చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారని.. అందుకోసం తాను అలాంటి వారికి సహాయం చేస్తున్నానని తెలిపాడు. వారికి కావల్సిన చేప పిల్లలు లేదా గుడ్లు.. వాటి ఆహారం.. ఇతర సామగ్రిని తాను పంపిణీ చేస్తున్నానని వివరించాడు.
అయితే ఈ చేపలను పెంచేవారు అవి ఉండే నీటి ఉష్ణోగ్రతను 5 నుంచి 15 డిగ్రీల వద్ద మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని ఉంచాలి. వాటిని యూవీ ఫిల్టర్ చేయాలి. ఇలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటేనే చేపలు సులభంగా పెరుగుతాయి. అయితే ఒకేసారి భారీ ఎత్తున కాకుండా కొద్ది కొద్దిగా ఈ చేపలను పెంచడం కూడా ప్రారంభించవచ్చు. దీంతో ఈ వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయని ఆదిత్య చెబుతున్నాడు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…