Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో మహేష్ బాబు, నమ్రత జంట ఒకటి. మాజీ మిస్ ఇండియా యూనివర్స్, నటి నమ్రతా శిరోద్కర్ని మహేష్ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కృష్ణ అస్సలు ఒప్పుకోలేదని టాక్. ఆ కారణంగానే వీరిద్దరి వివాహం చాలా సీక్రెట్గా, సింపుల్గా జరిగిందని అంటుంటారు. హీరోయిన్గా చేస్తున్న నమ్రతను పెళ్ళి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదట. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ పెళ్లికి నిరాకరించారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంతో ఉందో తెలియదు కానీ మొత్తానికి వాళ్లిద్దరి వివాహం చాలా సింపుల్గా జరిగింది.
నమ్రత, మహేష్లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు.ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2005 ఫిబ్రవరి 10న తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. ముంబైలో జరిగిన వీరి వివాహానికి తిరుపతి నుంచి పురోహితులు వెళ్లారు. పెళ్లి తరవాత నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.
2006లో కుమారుడు గౌతమ్ కృష్ణకు జన్మనిచ్చిన నమ్రత.. 2012లో సితార కు జన్మనిచ్చింది. ప్రస్తుతం మహేష్, నమ్రత అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నమ్రత అయితే ఒకవైపు కుటుంబానికి సంబంధించిన అన్ని పనులనూ చక్కబెడుతూ మరోవైపు మహేష్ చేపడుతున్న కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తుంటుంది. అయితే నమ్రత విషయం తన తండ్రి కృష్ణకు చెప్పినపుడు.. ఆయన అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదని ఓ సందర్భంలో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని ఒప్పించడానికి కాస్త టైమ్ పట్టిందని.. నువ్వు ష్యూరా అని రెండు మూడు సార్లు అడిగిన తర్వాత.. నీ ఇష్టం అన్నారని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…