Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో మహేష్ బాబు, నమ్రత జంట ఒకటి. మాజీ మిస్ ఇండియా యూనివర్స్, నటి నమ్రతా శిరోద్కర్ని మహేష్ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కృష్ణ అస్సలు ఒప్పుకోలేదని టాక్. ఆ కారణంగానే వీరిద్దరి వివాహం చాలా సీక్రెట్గా, సింపుల్గా జరిగిందని అంటుంటారు. హీరోయిన్గా చేస్తున్న నమ్రతను పెళ్ళి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదట. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ పెళ్లికి నిరాకరించారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంతో ఉందో తెలియదు కానీ మొత్తానికి వాళ్లిద్దరి వివాహం చాలా సింపుల్గా జరిగింది.
నమ్రత, మహేష్లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు.ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2005 ఫిబ్రవరి 10న తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. ముంబైలో జరిగిన వీరి వివాహానికి తిరుపతి నుంచి పురోహితులు వెళ్లారు. పెళ్లి తరవాత నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.
2006లో కుమారుడు గౌతమ్ కృష్ణకు జన్మనిచ్చిన నమ్రత.. 2012లో సితార కు జన్మనిచ్చింది. ప్రస్తుతం మహేష్, నమ్రత అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నమ్రత అయితే ఒకవైపు కుటుంబానికి సంబంధించిన అన్ని పనులనూ చక్కబెడుతూ మరోవైపు మహేష్ చేపడుతున్న కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తుంటుంది. అయితే నమ్రత విషయం తన తండ్రి కృష్ణకు చెప్పినపుడు.. ఆయన అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదని ఓ సందర్భంలో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని ఒప్పించడానికి కాస్త టైమ్ పట్టిందని.. నువ్వు ష్యూరా అని రెండు మూడు సార్లు అడిగిన తర్వాత.. నీ ఇష్టం అన్నారని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…