Salman Khan : బాలీవుడ్లో ఒకప్పుడు ఐశ్వర్యారాయ్, సల్మాన్ఖాన్ ల జంట అంటే చూడముచ్చటగా ఉండేది. వీరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడమే తరువాయి, అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది ? ఎందుకు విడిపోయారు ? అనే కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.
నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. సల్మాన్, ఐశ్వర్య విడిపోయేందుకు రెండు కారణాలను చెబుతుంటారు. అవేమిటంటే.. తనతో ఉన్న సల్మాన్ ఖాన్ను ఐశ్వర్య చీటికీ మాటికీ నిందించేదట. నీకు నేను కావాలో, నీ కుటుంబం కావాలో తేల్చుకో అని అడిగేదట. దీంతో సల్మాన్ ఖాన్ తన కుటుంబానికే ప్రాధాన్యతను ఇచ్చి ఆమెను వదులుకున్నాడని టాక్.
ఇక వారిద్దరూ విడిపోవడానికి ఇంకో కారణం ఉంది. అది ఐశ్వర్యారాయ్ వెర్షన్. ఆమే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. సల్మాన్ ఖాన్ మద్యం విపరీతంగా సేవిస్తాడని, ఆ మత్తులో తనను శారీరకంగా, మానసికంగా.. అన్ని విధాలుగా చిత్ర హింసలు పెట్టేవాడని, అందుకనే అతని నుంచి దూరం అయ్యానని ఐశ్వర్యారాయ్ చెప్పింది.
అయితే ఇవే కాకుండా.. వారిద్దరూ విడిపోయేందుకు ఇంకో కారణం కూడా అప్పట్లో తెగ ప్రచారం అయింది. ఐశ్వర్యారాయ్తో ప్రేమలో ఉండగానే సల్మాన్ ఇంకో హీరోయిన్ వెంట పడ్డాడని.. విషయం తెలిసిన ఐశ్వర్య అతన్ని దూరం పెట్టిందని, దీంతో సల్మాన్ ఒక రోజు ఐశ్వర్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవపడేందుకు యత్నించాడని, కానీ ఆమె తలుపు తెరవలేదని, తరువాత సల్మాన్ ఆమెకు శాశ్వతంగా దూరమయ్యాడని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏవి నిజమో, ఏవి అబద్దమో తెలియదు, కానీ సల్మాన్ మాత్రం బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. ఐశ్వర్యా రాయ్ మరోవైపు అభిషేక్ బచ్చన్ను చేసుకుని సంతోషంగా ఉంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…