T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 29వ మ్యాచ్లో శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వెనుకబడింది. వచ్చిన బ్యాట్స్మన్ వచ్చినట్లే ఔట్ అయ్యారు. దీంతో లంక జట్టు ఓటమి పాలైంది. శ్రీలంకపై ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి డి సిల్వ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. శ్రీలంక బౌలర్లలో హసరంగ డిసిల్వ 3 వికెట్లు పడగొట్టగా చమీర 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లకే ఆలౌట్ అయింది. 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాట్స్మెన్లలో హసరంగ డిసిల్వ 34 పరుగులు, రాజపక్స, శనక చెరో 26 పరుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్లు తలా 2 వికెట్ల చొప్పున తీశారు. క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టోన్ చెరొక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…