Whatsapp : దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో ఏకంగా 17 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించామని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 నవంబర్ నెలలో మొత్తం 602 ఫిర్యాదులు వచ్చాయని, వాటిల్లో 36 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే నవంబర్ నెలలోనే ఏకంగా 17,59,000 అకౌంట్లను తొలగించామని వాట్సాప్ తెలియజేసింది.
వాట్సాప్లో యూజర్ల భద్రతే తమకు ముఖ్యమని ఆ సంస్థ తెలియజేసింది. యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. వాట్సాప్లో ఎలాంటి వేధింపులకు తావు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేసింది.
వాట్సాప్ ప్లాట్ఫాంపై యూజర్లకు ఇప్పటికే ఎన్నో సేవలను అందిస్తున్నామని.. ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తున్నామని, దీని వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల గురించి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదన్నారు.
కాగా అక్టోబర్ 2021లో వాట్సాప్కు మొత్తం 500 ఫిర్యాదులు అందగా ఆ నెలలో 20 లక్షల అకౌంట్లను రద్దు చేసింది. వాటిల్లో ఎక్కువగా బల్క్ మెసేజ్లను దురుద్దేశంతో వాడినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే ఆ వాట్సాప్ అకౌంట్లను నిషేధించారు. ఇక వాట్సాప్కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…