Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో చాలా మంది అందులో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పలు పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. తమ డ్యాన్స్ లకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. గతంలో టిక్టాక్ యాప్ ఉన్నప్పుడు ఎలాగైతే చాలా మంది వీడియోలను పోస్ట్ చేసేవారో.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఇక లేటెస్ట్గా ఓ ఫ్లైట్ అటెండెంట్ కూడా అలాగే ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది.
స్పైస్ జెట్ అనే విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తాజాగా మై సే మినా సే నా సఖి సే.. అనే హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. స్పైస్ జెట్కు చెందిన ఖాళీగా ఉన్న విమానంలో ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ పాట 1987లో విడుదలైన నటుడు గోవిందా నటించిన ఖుద్గర్జ్ చిత్రంలోనిది. ఆ పాటకే ఆమె అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా ఉమా మీనాక్షి షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 65వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఆమె డ్యాన్స్ను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు పలు పాటలకు డ్యాన్స్లు చేస్తూ అలరిస్తుంటుంది. అలా ఈమెకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 8.71 లక్షలకు పైగా ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…