Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో చాలా మంది అందులో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పలు పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. తమ డ్యాన్స్ లకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. గతంలో టిక్టాక్ యాప్ ఉన్నప్పుడు ఎలాగైతే చాలా మంది వీడియోలను పోస్ట్ చేసేవారో.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఇక లేటెస్ట్గా ఓ ఫ్లైట్ అటెండెంట్ కూడా అలాగే ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది.
స్పైస్ జెట్ అనే విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తాజాగా మై సే మినా సే నా సఖి సే.. అనే హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. స్పైస్ జెట్కు చెందిన ఖాళీగా ఉన్న విమానంలో ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ పాట 1987లో విడుదలైన నటుడు గోవిందా నటించిన ఖుద్గర్జ్ చిత్రంలోనిది. ఆ పాటకే ఆమె అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా ఉమా మీనాక్షి షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 65వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఆమె డ్యాన్స్ను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు పలు పాటలకు డ్యాన్స్లు చేస్తూ అలరిస్తుంటుంది. అలా ఈమెకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 8.71 లక్షలకు పైగా ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…